టి నగర్ న్యూస్ :చెన్నై మహానగరంలోని న్యూ ఆవడి రోడ్డు, గాంధీనగర్ ఈసిఐ తెలుగు చర్చ్ లో శుక్రవారం ఉదయం ఈ సి ఐ సౌత్ఆంధ్ర డయాస్ బిషప్ ఆర్ కె ఎబెల్ నీలకంఠ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఫెలోషిప్ ప్రత్యేక ఆరాధన కార్యక్రమం జరిగింది. ఈ ప్రత్యేక ఆరాధనలో దేశ క్షేమం, సరిహద్దులో సమాధానం, రానున్న నూతన సంవత్సరములు ప్రతి కుటుంబంలో సంతోష సమాధానాలు కలగాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళలకు బహుమతులు, కొత్తబట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ పెద్దలు, సభ్యులు, స్త్రీల సమాజం, యవ్వనస్తులు తదితరులు పాల్గొన్నారు..