విల్లివాకం న్యూస్: క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ సమర్పణలో ఆసియా బాప్టిస్ట్ పాస్టర్స్ ఫెలోషిప్, మెర్సీ అండ్ ట్రూత్ ఉమెన్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్-23 వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. చెన్నై, అత్తిపట్టు పుదునగర్ లోని కల్వరి బాప్టిస్ట్ ప్రేయర్ గార్డెన్ దీనికి వేదికయింది.

ఈ కార్యక్రమానికి బెంగళూరు అమానా చర్చ్ ఫౌండర్, పాస్టర్ కె.పి రాజశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి దైవ సందేశాన్ని అందించారు. ఇందులో క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఎస్ ప్రకాష్ రాజ్, మెర్సి అండ్ ట్రూత్ విమెన్స్ ఫెలోషిప్ ట్రస్ట్, ఫౌండర్ పి. డయానా రోజ్, ఈసిఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ డాక్టర్ ఏబెల్ నీలకంఠన్, పాస్టర్ ఇశ్రాయేలుతో పాటు పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.

ముందుగా క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే ‘వై దిస్ నేటివిటీ’ అనే చిత్రాన్ని ప్రదర్శించారు. పాస్టర్ కేపీ రాజశేఖర్ దైవ సందేశాన్ని వినిపిస్తూ ప్రతి ఒక్కరూ దేవుని మహిమను ఈ లోకానికి ప్రత్యక్ష పరచాలని తెలిపారు. ఇందుకు ప్రేమ, మంచితనం, జాలి, కరుణ వంటి సద్గుణాలు కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు దైవ సేవకులు పాటలు, ప్రార్థనలతో దేవుని మహిమ పరిచారు. చివరిగా దైవ సేవకులు అందరికీ క్రిస్మస్ బహుమతులను అందజేశారు.