విల్లివాకం న్యూస్: చెన్నై తేనాంపేటలో గల కామరాజర్ అరంగంలో కవి వైరముత్తు రాసిన ‘మహా కవిదై’ పుస్తకావిష్కరణ సభ మంగళవారం జరిగింది. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విడుదల చేయగా, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పాల్గొన్నారు. అంతేకాకుండా, సైంటిస్ట్ మయిల్ సామి అన్నాదురై తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ మాట్లాడుతూ తాను కవిని కాదని, కవిత్వాన్ని విమర్శించ లేనని, కలంజర్ కరుణానిధి ఉన్నట్లయితే మహాకవిదై రూపుదిద్దిన వైరముత్తును బహుగా ప్రశంసించి ఉండే వారిని తెలిపారు.