చెన్నై పెరంబూరులో గల శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం తెరిచారు. భక్తులంతా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారికి తిరుమంజనం, అర్చన, ఆరాధనలు జరిగాయి. సుమారు 150 మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. అలాగే భజనలు, నామ సంకీర్తనం జరిగాయి. భక్తులంతా గోవింద నామస్మరణ చేశారు. అనంతరం అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు. ఇందులో సమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్. వెంకట్రామన్, కోశాధికారి పి. కోదండ రామయ్య ట్రస్టీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.