విల్లివాకం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51 జన్మదిన వేడుకలు గురువారం చెన్నైలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సిపి సేవాదళ్, తమిళనాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జాకీర్ హుస్సేన్ నేతృత్వం వహించారు. వ్యాసర్పాడి డాన్ బాస్కో లోని అనాధాశ్రమంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం, సంక్షేమ సహాయాల పంపిణీ, చేశారు.

అలాగే, పూందమల్లి జిఆర్టి సమీపానగల రాణి మ్యారేజ్ హాలులో జరిగిన కార్యక్రమంలో సుమారు 600 మంది అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్, బిర్యాని పంపిణీ, బైక్ ర్యాలీ జరిగింది. అలాగే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు రక్తదానం చేశారు. అభిమానులు ఆనందోత్సాహాలను పంచుకొంటూ హుషారుగా గడిపారు. కృతిక, శరవనన్, శరత్ కుమార్ రెడ్డి, సూర్య రెడ్డి, సాయి శంకర్ రెడ్డి పాల్గొన్నారు .