విల్లివాకం న్యూస్: ఇటీవల టీటీడీ సలహా మండలి సభ్యునిగా నియామకం చేయబడిన వి .రాధాకృష్ణ చేత గురువారం టీ .నగర్ వెంకట నారాయణ రోడ్ లో ఉన్న సమాచార కేంద్రంలో ఎల్ఏసి అధ్యక్షులు ఏజే .శేఖర్ రెడ్డి చేత పదవీ ప్రమాణం చేయడం జరిగింది. వేద పండితుల ఆశీర్వాదాలు పొందిన తర్వాత రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ అవకాశాన్నిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర రెడ్డికి, తమిళనాడు, పాండిచ్చేరి సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

 

శ్రీ వెంకటేశ్వర స్వామి గారి కరుణా కటాక్షాలతో భక్తులకు సేవ చేసే ధన్యత కలగటం మహాభాగ్యం అని అన్నారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా తన సేవలు అందిస్తానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో విజయకుమార్, సలహా మండలి సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి, మోహన్ రావు, డాక్టర్ సీఎం. కిషోర్, మాజీ మంత్రి గోకుల ఇందిర, ద్రావిడ దేశం కృష్ణారావు, మాజీ సలహా మండలి సభ్యులు మన్నం రవిబాబు, వ్యాపారవేత్త ఎరుకలయ్య , మాజీ కౌన్సిలర్ , అన్నా డీఎంకే నాయకురాలు ఎల్ చిత్ర, పుళల్ కావాంగరై తెలుగు అసోసియేషన్ సభ్యులు జి మురళి ,బి కిష్టయ్య , పి నరసింహ రావు, ఎం చిట్టిబాబు, ఓబుల్ రెడ్డి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.