తమిళనాడుకు వారణాసికి మధ్య సంబంధాలను బలోపేతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం భారతం.. ఉన్నత భారతం పథకం కింద కాశి తమిళ సంగమం కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించింది. ఇలా ఉండగా కాశి తమిళ సంగమం 2.0 పేరుతో రెండవ విడత కార్యక్రమాన్ని ఈ ఏడాది నిర్వహించేందుకు నిర్ణయించారు. దీంతో కాశి తమిళ్ సంగమం 2.0 కార్యక్రమం ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే 30వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి ఈ ఏడాది విద్యార్థినీ విద్యార్థులను, ఇతర వర్గాలకు చెందిన తమిళ ప్రజలను ప్రత్యేక రైలు ద్వారా తీసుకు వెళుతున్నారు. దీంతో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి శుక్రవారం ఉదయం 10:40 గంటల సమయంలో ప్రత్యేక రైలు బయలుదేరింది. ఈ రైలులో మూడు భోగిలలో 216 మంది విద్యార్థిని విద్యార్థులు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రత్యేక రైలును జండా ఊపి ప్రారంభించారు.