గిండి న్యూస్:ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని స్వరాజ్‌ మైదానం లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ ప్రాంతానికి స్మృతి వనం అని పేరు పెట్టారు. అంబేద్కర్ విగ్రహం ముందు, వెనుక పార్కులు ఏర్పాటు చేశారు.అలాగే ఈ మైదానంలో మినీ థియేటర్, మ్యూజియం, వాటర్ ఫౌంటెయిన్లు, పార్కింగ్, ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు.ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ…..

రూ.268 కోట్లతో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం మొదటి దశ జరిగింది.2వ దశలో రూ.106 కోట్లతో అంబేద్కర్ విగ్రహానికి పెయింటింగ్, సుందరీకరణ సహా పనులు తుదిదశకు చేరుకున్నాయి.19న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు.