ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, కార్వేటి నగరం మండలం, డి ఎం పురం గ్రామంలోని ఈ సీఐ లో సోమవారం ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ఆరాధన ఎంతో ఘనంగా జరిగింది. స్థానిక సంఘ కాపరి పాస్టర్ సిహెచ్ ముకుందరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కత్తిరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సంఘంలోని సభ్యులకు మహేంద్ర, మల్లేశ్వరి కుటుంబం తరఫున నూతన బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ చైర్మన్ ఈ సుధాకర్, కోశాధికారి టి ఎలీషా, డీకన్ పి. థామస్, సంఘ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు… చిత్తూరు న్యూస్.