హెచ్ సియు హ్యుమానిటీస్ డీన్ గా ఆచార్య జంధ్యాల ప్రభాకర్ రావు

హైదరాబాద్ న్యూస్ :హెచ్ సి యు, మానవీయ శాస్త్రాల విభాగం నూతన డీన్ గా ఆచార్య జంధ్యాల ప్రభాకర్ రావు బుధవారం నాడు (1.5.2024) పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత మూడేళ్ల పాటు డీన్ గా ఆచార్య వి. కృష్ణ నుండి ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఆచార్య వి కృష్ణ డీన్ గా తన మూడేళ్ల కాలంలో నూతన అధ్యాపకుల రిక్రూట్మెంట్ లోను, పదోన్నతులు కల్పించడంలోని చురుకైన పాత్రను నిర్వహించారని, మానవ శాస్త్రాల విభాగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా పాల్గొన్న వివిధ శాఖ అధ్యక్షులు, ఆచార్యులు ప్రశంసించారు. తన విధిని తాను నిర్వర్తించాననీ, తనకు సహకరించిన అందరికీ ఆచార్య వి. కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆంగ్ల, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫిలాసఫీ తదితర శాఖల అధ్యక్షులు ఆచార్య డి.మురళీ మనోహర్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య సిహెచ్. అన్నపూర్ణ, ఆచార్య అంబా కులకర్ణి, ఆచార్య అరుళ్ మోజీ, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య లక్ష్మీ నారాయణ లెంకా, ఆచార్య పిల్లలమర్రి రాములు , ఆచార్య గోనానాయక్, ఆచార్య హైమవతి, డా.పి.విజయ్ కుమార్, సురేష్ కుమార్, భవానీ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
……………………..