వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు

చెన్నై న్యూస్ ::స్థానిక కొరట్టూర్ అగ్రహారం రామాలయం వీధిలో ఉన్న శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలోని కోదండ రామాలయంలో వైశాఖ బహుళ శుద్ధమి దశమి శుభప్రద లగ్నంలో శ్రీ హనుమత్ జయంతి ని శనివారం వైభవంగా జరుపుకున్నారు. ఉదయం 8 గంటలకు పాలు పెరుగు, తేనే , పన్నీరు , నారికేల జలం ,సుగంధ ద్రవ్యాలతో అంజనీ పుత్రుడి అభిషేకాలు, అర్చన పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన మండపంలో శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు.స్వామివారికి భక్తురాలు శోభ రాజా ఆంజనేయ స్వామికి కానుకగా వెండి కిరీటం సమర్పించారు.దానిని ఆంద్ర కళా స్రవంతి కార్యవర్గ సభ్యులు సమక్షంలో ఆంజనేయ స్వామికి కిరీటాన్ని దరింప జేశారు.అలాగే తమలపాకులు, వడమాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు 108 సార్లు శ్రావ్యమైన రాగలతో హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగింది.

హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ , శ్రావ్య రాగాస్ బృందం సభ్యులు హనుమంతుడి జీవిత చరిత్ర విశేషాలతో సంగీత కార్యక్రమం నిర్వహించి అలరించారు.భక్తుల జై శ్రీరామ్, జై హనుమాన్ దివ్యమైన నామ స్మరణలతో మారుమ్రోగింది. వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం , భక్తులకు అన్నతీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఏర్పాట్లు ను స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు, సలహాదారు ఎం ఎస్ .మూర్తి , కార్యదర్శి జె.శ్రీనివాస్, కోశాధికారి జి .వి రమణ , కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
………………………