చీ. చీ..వీడు కొడుకా
.. కాలయముడా..!!

ఈ దుర్మార్గున్ని ఊరికే వదలకూడదు

తల్లిదండ్రులపై అత్యంత దారుణంగా కొడుకు దాడి

అస్థి కోసం తల్లిదండ్రుల పై అమానుషంగా దాడి

విలవిలలాడిన వృద్ధ దంపతులు

రాయలసీమ న్యూస్ :ఆస్తి పంపకాల విషయంలో తల్లి దండ్రులపై తనయుడు ఘాతుకానికి వడి గట్టాడు. అమానుషంగా దాడి చేసిన ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది చోటు చేసుకుంది. మదనపల్లి రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు… పట్టణంలోని నీరు గట్టువారిపల్లె, అయోధ్యనగర్ లో ఉంటున్న దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులురెడ్డికి భూ వివాదం ఉంది. దీంతో ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడ్డాడు. తల్లి దండ్రులు దన్నం పెడుతున్నా వదల కుండా కసాయి కొడుకు శ్రీనివాసులు రెడ్డి కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు తల్లడిల్లడం హృదయాలను తీవ్రంగా కలచి వేసింది. తల్లిని కాళ్లతో తన్నాడు. ఎద రొమ్మున నిలువునా తన్నాడు. పిడి గుద్దులు గుద్దాడు. జుట్టు పట్టి లాగాడు. మంచంపై కూర్చుని ఉన్న వయోవృద్ధుడు తండ్రిని విచక్షణ రహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలు చూసిన వారు చెల్లించిపోయారు. మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది.
బాధిత వృద్ధ దంపతులను మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సలు అందజేస్తున్నారు. వీడు కొడుకా… కసాయివాడ.. అని విరుచుకుపడుతున్నారు. ఈ దుస్సంఘటన అంతటా కలవరాన్ని కలిగిస్తోంది