కొరుక్కుపేట రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల ఆందోళ

చెన్నై న్యూస్: కొరుక్కుపేట రైల్వే స్టేషన్ వద్ద
ప్రయాణికులు బుధవారం ధర్నా చేశారు. ఈ మార్గము నందు ప్రతిరోజూ లోకల్ ట్రైన్స్ ఆలస్యముగా నడుస్తున్నాయని, దాదాపు ఒకటిన్నర నెల రోజులుగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆరోపించారు. బుధవారం 08.05.2024న మద్రాస్ బీచ్ ట్రెయిన్ 9.35 గంటలకు ప్లాట్ఫారంకు చేరుకుంది. అప్పటి నుండీ చాలా సేపు సిగ్నల్ ఇవ్వలేదు.

కారణం ఒక గూడ్స్ ట్రైన్ ఈ ట్రెయిన్ కు ముందు బీచ్ మర్గమునందు పంపించి ఆపేశారు. వ్యతిరేక మార్గం నందు గుమ్మడిపూండి ట్రెయిన్ కొరకు ఆపేశారు. దీనితో ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చేసి ధర్నా చేసారు. రైల్వే స్టేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోనందున ప్రయాణికులు అగ్రహానికి లోనయ్యారు.