వేసవి తాపం ఉపశమనం కోసం వామ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ

టీ నగర్ న్యూస్:చెన్నైలో ప్రస్తుతం భానుడి ప్రతాపం 40 డిగ్రీలు దాటింది.మనుషులతో పాటు పశు పక్షాదులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో కొంత ఉపశమనం కోసం ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (వామ్) గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ఆధ్వర్యంలో చిక్కటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది.దీనికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ కు చెందిన వామ్ గ్లోబల్ లీడర్ బండారు సుబ్బారావు సతీసమేతంగా విచ్చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రద్దీ ఎక్కువగా ఉన్న కూడలిలో సుమారు 4వేల మందికి పైగా మజ్జిగ స్వీకరించి సంతోషించారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడానికి చెన్నై కు చెందిన వామ్ లీడర్ బెల్లంకొండ శివ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు శ్రీలత ఉపేంద్ర, వామ్ పిఆర్వో పేర్ల బద్రినారాయణ, రాధాకృష్ణ, బొగ్గారపు ప్రసాద్ , కస్టమ్స్ అసిస్టెంట్ కమీషనర్ – చెన్నై వై.విజయమూర్థి ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.
తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి కొన్ని వందల వామ్ విభాగాలు ఇటువంటి మజ్జిగ, తాగునీటి చాలివేంద్రం వంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ వివరాలను గ్లోబల్ ఆఫీసుకు పంపించాలి అని కోరారు. మజ్జిగ తాగు నీటి వితరణ కార్యక్రమాలు వేసవికాలం ముగిసే వరకు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారుఅలాగే ఎంతో ఉత్సాహంతో అన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తంగుటూరి రామకృష్ణ గారిని బండారు సుబ్బారావు , వై. విజయమూర్తి లు అభినందించారు.
……………………