![](https://telugunewstimes.in/wp-content/uploads/2024/02/Screenshot_2024_0202_061125.jpg)
జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు సాంభాయ్ సోరెన్ను గవర్నర్ ఆహ్వానించారు
ఢిల్లీ ప్రతినిధి :భూమికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల కేసులో నిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరన్ను ఎన్ఫోర్స్మెంట్ విభాగం 7 గంటల పాటు విచారించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాత్రి హేమంత్ సోరన్ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో హేమంత్ సోరన్ తరఫున సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైందికాగా, సాంభాయ్ సోరన్ నిన్న జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాసం కల్పించాలని కోరారు. గవర్నర్ను కలిసిన అనంతరం సాంబాయి సోరన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు సాంబాయి సోరన్ను రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. గవర్నర్ అర్ధరాత్రి పిలిచారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా సాంభాయ్ సొరన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
……………….