చెన్నైలో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’

విల్లివాకం న్యూస్: చెన్నైలో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా జరిగింది.
ఐదవ ఏడాదిగా షెనాయ్ నగర్ లో గల తిరువిక పార్క్ నుంచి బిషప్ డాక్టర్ ఎస్ ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. రెవరెండ్ డా. సెల్వం జోసెఫ్ అధ్యక్షత వహించారు. దీనిని ప్రార్థనతో బిషప్ డా. దేవపాలన, ఈసిఐ, సౌత్ ఆంధ్రా డయాసిస్ బిషప్ ఆర్కె ఎబెల్ నీలకంఠన్, బిషప్ ఎస్ఎం జయకుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

ఇందులో వందలాది మంది తెలుగు, తమిళ పాస్టర్లు విశ్వాసులు పాల్గొన్నారు. ఈ రన్ సుమారు మూడు కిలోమీటర్ల మేరకు సాగింది. షెనాయ్ నగర్, తిరువిక పార్క్ నుంచి ప్రారంభమై అన్నా నగర్ ఈస్ట్ లో గల మోహన్ విల్లా పార్కులో ముగిసింది.

మద్రాసు సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి, పాస్టర్ డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్ ఈస్టర్ సందేశాన్ని వినిపించి శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా బిషప్ ఎస్ ప్రకాష్ రాజ్ ప్రార్ధన, వందన సమర్పణ చేసి ఆశీర్వాదం అందజేశారు. ఇందులో పాల్గొన్న వారికి ఉదయకాల అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా సహకరించిన కె3,కె4 పోలీసు సిబ్బందికి, ఎన్నికల అధికారులకు ఆసియా బాప్టిస్ట్ పాస్టర్స్ ఫెలోషిప్, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్, తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
……………………