ఘనంగా ఉగాది కుటుంబ పండుగ వేడుకలు

విల్లివాకం న్యూస్: తిరువళ్లూరు జిల్లా, పొన్నేరి మండలం, కమ్మ నాయుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది కుటుంబ పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. దీనికి పొన్నేరి ఆర్.ఆర్.మహల్‌ వేదికగా నిలిచింది. ఈ సభకు సంఘ ప్రెసిడెంట్ కె.డి.వాసుదేవ నాయుడు అధ్యక్షత వహించారు.ప్రత్యేక అతిథులుగా జయ ఎడ్యుకేషన్ గ్రూప్ వ్యవస్థాపకులు. ఎ. కనకరాజ్ నాయుడు, అన్నాచ్చి సూపర్ మార్కెట్ వ్యవస్థాపకులు కె. సుబ్బయ్య నాయుడు, డాక్టర్ భాస్కర్ నాయుడు, పారిశ్రామికవేత్త జయశేఖర్ నాయుడు, జెఎన్ఎన్ ఎడ్యుకేషన్ గ్రూప్, వ్యవస్థాపకుడు, ఎస్. జయచంద్రన్ నాయుడు, తమిళనాడు తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి, వి.ఆనందరామన్ నాయుడు, వివేకానంద విద్యాలయ, ప్రిన్సిపాల్, ఆర్ఎంఆర్ జానకిరామన్ నాయుడు, పారిశ్రామికవేత్త, ఎస్ బి ప్రోటీన్, బిల్డర్స్ తాళ్లూరి సురేష్ నాయుడు, ఎం. బాబు నాయుడు పాల్గొన్నారు.

ఇందులో ఎ. కనకరాజ్ నాయుడు మాట్లాడుతూ తెలుగు వారంతా ఐక్యతతో కలిసి మెలిసి ఉండాలని, అలాగే సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టి. సురేష్ మాట్లాడుతూ కమ్మ, నాయుడు అభివృద్ధి చెందిన వారంతా పేద విద్యార్థులకు సహకరించాలని అన్నారు. అలాగే తెలుగు భాషను బ్రతికించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా 20 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నేరి శరత్, కార్యదర్శి యు జి సుకుమార్, ధనుంజయన్, ఈ కార్యక్రమంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పాల్గొని ఉత్సాహంగా నిర్వహించారు.
………………