ఘనంగా విజిఎన్ ఫేర్మాంట్ ఉగాది వేడుకలు

విల్లివాకం న్యూస్: చెన్నై గిండిలో గల విజిఎన్ ఫేర్మాంట్ లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ, అధ్యక్షులు దేవరకొండ రాజు అధ్యక్షత వహించారు. ఇందులో ప్రముఖ జ్యోతిష పండితులు గోసు ప్రకాశం పంచాంగ పఠనం గావించి రాశుల ఫలితాల గురించి వివరించారు. అలాగే ఉగాది పండుగ గొప్పదనాన్ని, తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేశారు. ఇందులో సంస్థ అధ్యక్షులు దేవరకొండ రాజు మాట్లాడుతూ తమ సొసైటీ అనేక కార్యక్రమాలు చేపడుతూ తెలుగు వారికి అండగా నిలుస్తోందని, వారి అవసరాలలో సహాయపడుతున్నట్లు తెలిపారు. సామాజిక, వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సభ్యులందరూ ఉగాది పచ్చడిని ఆరగించారు. ఇందులో తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్, నిడమర్తి లావణ్య మాట్లాడుతూ ఇంతవరకు సంస్థ సాధించిన విజయాల గురించి సభ్యులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో బోడిపూడి రఘునాథ్, కారుమూరి శ్రీనగేష్, చట్టాల మోహన్ కుమార్, పెనిగల్ పాటి రవికుమార్, సుగంధ కార్తీక్, స్వాతి పలుకూరు, సుజిత మరియు క్రిష్ ఆనంద్ సహా అనేకమంది విజిఎన్ సభ్యులు పాల్గొన్నారు.