ఆకట్టుకున్న ‘వేద విజ్ఞాన వేదిక’ కార్యక్రమం

విల్లివాకం న్యూస్: వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో
తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక
148వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చెన్నై టీ.నగర్, విజయ రాఘవ రోడ్డులో గల ఆంధ్రా క్లబ్, కృష్ణా హాలు వేదికగా ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ మాసం ‘ప్రాచీన కావ్య సాహిత్యములో ఆధునిక వైద్యాంశములు’ అనే అంశంపై వక్తగా విచ్చేసిన గుంటూరు, ఆర్థోపెడిక్స్ వైద్య నిపుణులు, డా. ఎ.వి. దక్షిణామూర్తి ప్రసంగించారు.

ముందుగా సంస్థ కార్యదర్శి కందనూరు మధు స్వాగతోపన్యాసం చేశారు. అధ్యక్షులు జెకె రెడ్డి వక్తను సభకు పరిచయం చేశారు. ఇందులో డాక్టర్ ఏవి దక్షిణామూర్తి ప్రసంగిస్తూ ప్రాచీన కాల వైద్య విధానంలో నేటి కాలానికి సంబంధించిన అనేక వైద్య పదాలు ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అనేక విషయాలను కూలంకషంగా వివరించారు. ముందుగా నిర్వాహకులు ముఖ్య అతిథిని ఉచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు అనేకమంది విచ్చేశారు.