చెన్నై తాంబరంలో ఓ ఇంటిపై కాల్పులు జరగడంతో కలకలం

గిండీ న్యూస్:చెన్నై తాంబరం మీనంబాల్ వీధిలో ఉన్న న్యాయవాది త్యాగరాజన్ ఇంట్లో తుపాకీ పేలడంతో కలకలం రేగింది.ఇంటి అద్దాలు పగలడంతో ఇంట్లో ఉన్న త్యాగరాజన్ భార్య, కుమారుడు షాక్‌కు గురయ్యారు. ఎయిర్ ఫోర్స్ అధికారి నివాస ప్రాంతం నుంచి బుల్లెట్ ప్రమాదవశాత్తూ వెళ్లిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.