తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు : కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

విల్లివాకం న్యూస్ :రామోజీరావు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. ఈనాడు గ్రూప్‌కు చైర్మన్ గా తెలుగు భాష పట్ల ఆయన చూపించి ప్రేమ ఎన్నటికీ మరువరాదని, నిర్మాతగా 60కి పైగా సినిమాలను నిర్మించి ఎన్నో అవార్డులను పొందారని, రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలిచారని అన్నారు. దక్షిణాది చలనచిత్ర షూటింగ్ లతో ఆ స్టూడియో ఎప్పుడు బిజీగా
ఉంటుందని, అలా ఎందరో కార్మికులకు ఆ స్టూడియో ద్వారా పని కల్పించారన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏ.పి అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.