కూటమి మేనిఫెస్టో విడుదల: మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు….. పూర్తి వివరాలు

అమరావతి న్యూస్ :ఏపీలో కూటమి పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసింది. ఈనెల 30(మంగళవారం) మధ్యాహ్నాం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదలైంది.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ ఎన్నికల కో ఇన్‌చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్‌లు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.

యువత, మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కూటమి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్, పింఛన్ పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామంటూ మేనిఫెస్టోలో కూటమి పార్టీలు వెల్లడించాయి.

కూటమి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే
1.మెగా డీఎస్సీపై తొలి సంతకం
2. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు
3. దివ్యాంగుల పెన్షన్ రూ.6000
4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500
5. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం
6. వృద్ధాప్య పెన్షన్ రూ.4000
7. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి
8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15,000
9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి
11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000
12.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్
13.బీసీ రక్షణ చట్టం
14.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం
15.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం
16.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్
17.పూర్ టూ రిచ్ పథకం
18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ
19. పండుగ కానుకలు
20.ఉచిత ఇసుక

21.అన్నా క్యాంటీన్లు
22.భూ హక్కు చట్టం రద్దు
23.పెళ్లి కానుక రూ.1,00,000/-
24.విదేశీ విద్య పథకం
25.కరెంటు చార్జీలు పెంచం
26. ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సాయం
27. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకుంటాం
28. చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు
29. ఆర్యవైశ్యుల వ్యాపారాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సహకాలు
30. ఆక్వాకల్చర్‌ రంగం అభివృద్ధికి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం
31. ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్ధరిస్తాం
32.లాంట్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం

మేనిఫెస్టోయే కీలకం
రాజకీయాల్లో ఎన్నికలు అత్యంత కీలకం. అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలే ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తాయి. అందుకే మేనిఫెస్టో రూపకల్పన అనేది అన్ని రాజకీయ పార్టీలు అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఏపీలో కూడా మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఇతర పార్టీలు అన్నీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే వైసీపీ సైతం మేనిఫెస్టోను విడుదల చేశారు. దీంతో కూటమి సైతం మేనిఫెస్టోను విడుదల చేసింది.
………………………