నాయకులు సంఘానికి ఆదర్శవంతంగా ఉండాలి!
-సీనియర్ పాస్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్
– ఎంసిటిబిసి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

చెన్నై న్యూస్: నాయకులైన ప్రతి వ్యక్తి, సంఘ విశ్వాసులకు, సంఘం వెలుపల నున్న జనులకు, మన దేశానికి ఆదర్శంగా జీవిస్తూ , సత్య వాక్య ఆధారంగా పరిచర్య చేయుట నిజమైన సేవక ధర్మమని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘ (ఎంసిటిబిసి) కాపరి రెవరెండ్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. 2024 -25 వ సంవత్సరానికి నూతనంగా ఎంపికైన అధ్యక్షులు జి.రామయ్య, కార్యదర్శి పోతల ప్రభుదాసు, కోశాధికారి ఏ. బాబు, ఇతర కమిటీ నిర్వహకులచే ఆదివారం జరిగిన ఆరాధనలో ప్రమాణస్వీకారం చేశారు. పాస్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా, పొదిలి సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ గొంగటి సురేష్ కుమార్ విచ్చేసి దైవ సందేశం అందించారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గ కమిటీ ఎంపిక వివరాలను, సంఘంలో నిర్వహించనున్న కార్యక్రమాల్ని నూతన కార్యదర్శి పోతల ప్రభుదాసు ప్రకటించారు.