మాస్’ ఒల్లేరి జగ్గయ్య కన్నుమూత

విల్లివాకం న్యూస్: మద్రాసు ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం (మాస్) మాజీ అధ్యక్షులు ఒల్లేరి జగ్గయ్య బుధవారం చెన్నైలో మృతి చెందారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ సాయపేట లక్ష్మీపురంలో 04 జూలై 1944లో జన్మించారు. ఒల్లేరి జగ్గయ్య ఇన్ కమ్ టాక్స్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇన్ కమ్ టాక్స్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సేవలందించారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు జానకిరామ్ కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. రెండో కుమారుడు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, సీనియర్ మేనేజర్ గా ఉన్నారు. జగ్గయ్య రాయపురంలోని మాస్ అభివృద్ధిలో విశేష పాత్ర పోషించారు. సామాజిక సేవలోనూ నిమగ్నమయ్యారు. ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు చెన్నై, మూలకుత్తరంలో బుధవారం సాయంత్రం జరిగాయి. ఆయన మృతి పట్ల మాస్ అధ్యక్షులు డాక్టర్ కొల్లి రాజు, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి అజరత్తయ్య, కార్యవర్గ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలిపారు.