ఇళయరాజాను పరామర్శించిన ఎంపి కనిమొళి

విల్లివాకం న్యూస్: సంగీత దర్శకుడు ఇళయరాజాను పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి గురువారం పరామర్శించారు. సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె, గాయని భవతారిణి క్యాన్సర్‌తో బాధపడుతూ 25వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. భవతారిణి మృతి సినీ పరిశ్రమను కుదిపేసింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం తేనిలో ఖననం చేశారు. భవతారిణి మృతికి సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇలాఉండగా, డీఎంకే పార్లమెంటు సభ్యురాలు కనిమొళి ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశానికి హాజరుకావడంతో వెంటనే చెన్నైకి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి చెన్నై వచ్చారు. గురువారం టి.నగర్‌లోని ఇళయరాజా ఇంటిని సందర్శించారు. అక్కడ ఆమె ఇళయరాజా, అతని కుమారుడు స్వరకర్త యువన్ శంకర్ రాజాను ఓదార్చారు.