రామోజీరావు కన్నుమూత : ఏఐటిఎఫ్ సంతాపం

విల్లివాకం, న్యూస్: ప్రముఖ వ్యాపారవేత్త, పాత్రికేయులు, సినీ నిర్మాత, పద్మ విభూషన్ చెరుకూరి రామోజీరావు (87) గారి మరణానికి అఖిల భారత తెలుగు సమాఖ్య ప్రగాఢ సంతాపం తెలుపుతూంది. ఆయన నిర్మించిన ఫిల్మ్ సిటీ వారి కళాత్మక అభిరుచికి నిదర్శనం. ప్రపంచ ఖ్యాతి పొందిన పత్రిక, టీవీ సినీరంగానికి వారి సేవలు అసమానం. సుమారు 40 సం. పూర్వం అయన బంధువు అట్లూరి రామారావుకు ఒక పెద్ద ఆపరేషన్ చేయడానికి నన్ను హైదరాబాద్ పిలిపించి, ఆరోజు సాయంత్రం నా గౌరవార్థం వారి ఇంట్లో విందు ఏర్పాటు చేసిన సందర్బం నేను మరువలేనిది. అప్పటి నుండి మా స్నేహం కొనసాగింది. ఆయన పవిత్రాత్మకు దేవదేవుని సాన్నిధ్యంలో సద్గతి ప్రాప్తిరస్తు.

ఆచార్య సీఎంకే రెడ్డి, అధ్యక్షులు
allindiatf.com