వలసరవాకం ఆర్యవైశ్య అసోసియేషన్ సత్యనారాయణ పూజ

టీ నగర్ న్యూస్: చెన్నై మహానగరంలోని వలసరవాకం ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యనారాయణ పూజ మంగళవారం సాయంత్రం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వలసరవాకం లోని పార్వతి మహాల్ వేదికయింది.

ఈ ప్రాజెక్టు చైర్మన్ టి ఏ రమేష్, సర్వీస్ ప్రాజెక్టు స్పాన్సర్ డి రవి మోహన్ సమక్షంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా 45 మంది దంపతులు సాంప్రదాయ బద్ధంగా పీటలపై కూర్చొని ముందుగా గణపతి పూజ, అనంతరం సత్యనారాయణ పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో వేద పండితులు మంత్రోచ్ఛారణ చేయగా దంపతులు పుష్పాలను చల్లుతూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను ప్రెసిడెంట్ కె. నారాయణ, సెక్రెటరీ ఆర్ వి ఎల్ రత్నకుమార్, ట్రెజరర్ టి నరసింహారావు, జాయింట్ సెక్రెటరీ అమర నారాయణ, పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి ప్రసాదాలను, అన్నదానం అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సత్యనారాయణ పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సత్యనారాయణ పూజ, మంజాల పూజలు నిర్వహిస్తున్నామని సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.