వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం

విల్లివాకం న్యూస్: సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవాలను ఎంతో వైభవముగా జరుపుకుంటున్నారు. ఈ క్రోధి నామ సంవత్సరములో 27వ వార్షిక శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం, శ్రీరామనవమి రోజున బుధవారం ఘనంగా జరుపుకున్నారు.

దీనికి సీతారామ నగర్ లోని సంఘ కార్యాలయం వేదికగా నిలిచింది. ఇందులో వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. 17.04.2024 నుండి 19.04.2024 వరకు ప్రతిరోజూ సాయింత్రం గం.6.30 నుండి సామివారిని కీర్తిస్తూ భజన కార్యక్రమాలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు వడపప్పు, పానకం, నైవేద్యం పంచి అలాగే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధ్యక్షులు బి సురేష్ బాబు, కార్యదర్శి పి లక్ష్మణరావు, కోశాధికారి డి పిచ్చేశ్వర రావు, ఉపాధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఏ దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిలు కే శ్రీనివాస్ కుమార్, బి శ్రీధర్ చేశారు.