విజయవంతమైన రక్షణ సువార్త మహాసభలు

విల్లివాకం న్యూస్: స్థానిక కొరుక్కుపేట, చిగిరింతపాలెంలో గత రెండు దినములు జాషువా స్పిరిచ్యువల్ ఆర్మీ మరియు గిద్యోన్ యూత్ లయన్స్ వారి ఆధ్వర్యంలో రక్షణ సువార్త మహాసభలు నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎఫ్ వ్యవస్థాపకులు రెవ. డాక్టర్ జడ వసంతబాబు మాట్లాడుతూ

ప్రతి తల్లిదండ్రులు తమ తమ పిల్లల భవిష్యత్తు గురించి దేవుని ప్రార్థించాలని సూచించారు. నేటి యువతరం దుర్వ్యసనాలకు గురవుతున్నారని, వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడిసన్ తల్లి నాన్సీ గొప్ప ప్రార్ధనే ఆయనను గొప్ప శాస్త్రవేత్తగా మార్చిందని, థామస్ అల్వా ఎడిసన్ ఇచ్చిన సాక్ష్యమును వసంతబాబు జ్ఞాపకము చేశారు. ఈ సందర్భంగా నవ సమాజం సృష్టించుటకై యవ్వనులు తీసుకుంటున్న ప్రయత్నాలను అభినందించారు. ఈ సభలకు వందలాది మంది పలు ప్రాంతముల నుంచి విచ్చేశారు. గిద్యోను యూత్ లయన్స్ కార్యకర్తలు, జాషువా స్పిరిచ్యువల్ ఆర్మీ కార్యకర్తలు, చిగిరింతపాలెం మేరీమాత ఆలయ అధికారి వర్గము, చిగిరింతపాలెం యువజన అధికార వర్గం పాల్గొన్నారు. యూత్ డైరెక్టర్ ఓ హనోకు వందన సమర్పణతో కార్యక్రమము విజయవంతముగా ముగిసింది.