టి.టి.డి లో గతంలో జరిగిన మోసాలపై ఈ ప్రభుత్వం విచారణ జరిపించాలి….కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

చెన్నై న్యూస్ :తిరుమల తిరుపతి దేవస్థానం మోసాలకు నెలవుగా మారిపోయిందని,తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే హక్కు భ్తకులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు ఆర్టీఐ పరిధిలో ఉంటే ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం లేదని తెలిపారు. ఆర్టీఐ పరిధిలోకి తిరుమల తిరుపతి దేవస్థానం రాకుండా కేసులు వేశారంటూ మండిపడ్డారు.
టీటీడీలో కొన్ని సంవత్సరాలుగా భక్తులను నిలువుదోపిడికి గురిచేస్తున్నారన్నారు. ఆర్జిత సేవ టిక్కెట్లు బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయన్నారు. చెన్నై, ముంబై, బెంగళూరు నగరాలకు చెందిన కొందరు దళారులు ఆర్జిత సేవా టిక్కెట్లలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు గతం లో జరిగిన పాలకమండలికి ఈ- కోటా విధానం లో జరిగిన మోసాలపై , అదేవిధంగా కొండపై జరిగిన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ మోసలపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గతం లో ఈ- కోట విధానం వల్ల దళారుల వ్యవస్థ ఎక్కువగా ఉండేదని.ఈ ఆర్జిత సేవ కుంభకోణలను వెలికి తియ్యాల్సిన విజిలెన్స్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారని ప్రభుత్వ మెప్పుకోసం అప్పుడప్పుడు ఎప్పుడో పట్టుకున్న వారిని పట్టుకుని జిమ్మిక్ లు ఆడుతున్నారని అన్నారు.
తిరుమల పవిత్రతను కాపాడాల్సిన విజిలెన్స్ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాసరని
మండిపడ్డారు. విజిలెన్స్ అధికారులు కొండపై చిరు వ్యాపారులకు అక్రమ వడ్డీకి డబ్బులు ఇస్తూ వారి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారన్నారు. టీటీడీ ఎన్నో కుంభకోణలు, మోసాలు, నిలువుదోపిడీలకు అడ్డాగా మారిపోయిందన్నారు. తిరుమలలో మద్యం, సిగరెట్లు ,గంజాయి లాంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్నారు.
తిరుపతిలో మధ్యపాన నిషేధం, మాంసాహార నిషేధం చేస్తే సీఎం చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. కొండమీద పేరుకు మాత్రమే దర్శనాలు కొన్ని ఆన్ లైన్ అని మిగిలినది అంతా క్యాష్లైన్ (cashline)అన్నారు. గతంలో చెన్నై లో లోకల్ advisory కమిటీ నందు ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాన్ లోకల్స్ అయిన నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారిని నియమించారని, తిరుమలలోని అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తితో అయినా విచారణ చేపట్టాలని . సీఎం చంద్రబాబు ప్రాణాలు కాపాడిన వెంకన్నపేరుతో జరిగిన మోసాలకు అడ్డుకట్టవేసి తిరుపతి వాసిగా రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కేతిరెడ్డి కోరారు. వెంకన్న పేరుతో దోపిడీలు చేస్తున్న దళారి వ్యవస్థను రూపుమాపి వెంకన్నరుణం తీర్చుకోవాలని కోరారు.
అధికారులు వెంకన్న భక్తులకు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిచేందుకు కృషి చెయ్యాలని ప్రకటనలో ముఖ్యమంత్రిని కోరారు.
……………..