మహిళల భద్రతపై యువత అవగాహన ర్యాలీ

విల్లివాకం న్యూస్: సైబర్ ప్రపంచంలో మహిళల భద్రతపై యువత అవగాహన ర్యాలీని గ్రేటర్ చెన్నై సిటీ పోలీస్ మరియు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసిడబ్ల్యూఓ) సంయుక్తంగా గురువారం ఉదయం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఎగ్మూర్ లోని రాజరత్నం స్టేడియం వేదికగా నిలిచింది. ఇందులో ముఖ్య అతిథిగా గ్రేటర్ చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ పాల్గొన్నారు. ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేసి పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లతో అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, వాట్సాప్ లలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోరాదని హితవు చెప్పారు. అన్ని సమయాలలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం విద్యార్థులచే ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.ఎ.పార్వతి,
కార్యదర్శి ఎ.జె.హరిహరన్ పాల్గొన్నారు.