వైఎస్ అనిల్ రెడ్డితో జాకీర్ హుస్సేన్ భేటి

విల్లివాకం న్యూస్: తమిళనాడు వైఎస్ఆర్సిపి సేవాదళ్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ చెన్నై, ఆల్వార్ పేటలో ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డిని ఆదివారం కమిటీ సభ్యులతో కలిసి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో కమిటీ ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు వైఎస్ఆర్సిపి సేవాదళ్ అధ్యక్షునిగా జాకీర్ హుస్సేన్ నియమిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ సిఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలలో పార్టీకి ఓటు వేయడానికి తమిళనాడులోని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను కూడగడతానని, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో
జాకీర్ హుస్సేన్ తో పాటు శరవణన్, సూర్య రెడ్డి, కృతి, సాయిసింహా రెడ్డి, శివా రెడ్డి, మణికండన్, నిరంజన్ రెడ్డి, భాను పాల్గొన్నారు. అలాగే, అనేక మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా వచ్చి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పనికి సహకరించనున్నట్లు పేర్కొని ధన్యవాదాలు తెలిపారు.